Chandrababu : చంద్రబాబు సింగపూర్ పర్యటన: పెట్టుబడులు, భాగస్వామ్యాలపై చర్చ:ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించిన భారీ ప్రాజెక్టులకు సింగపూర్ నుంచి మరింత సహకారం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సింగపూర్లో తన రెండో రోజు పర్యటనలో భాగంగా, సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్తో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం భేటీ అయ్యారు.
సింగపూర్-ఏపీ: గ్రీన్ ఎనర్జీ, గృహ నిర్మాణంలో కొత్త శకం
ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించిన భారీ ప్రాజెక్టులకు సింగపూర్ నుంచి మరింత సహకారం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సింగపూర్లో తన రెండో రోజు పర్యటనలో భాగంగా, సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్తో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు వంటి రంగాలలో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే, డేటా సెంటర్ల ఏర్పాటుకు సింగపూర్ సహకారం అవసరమని చంద్రబాబు అన్నారు. లాజిస్టిక్స్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని, ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని సింగపూర్ మంత్రికి వివరించారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సింగపూర్ ఏపీకి సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాలలో కూడా సింగపూర్ భాగస్వామ్యం అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్తో సీఎం చర్చించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, రికార్డులను సరి చేసేందుకే సింగపూర్ వచ్చానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సింగపూర్పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ను నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. సింగపూర్ను చూసే గతంలో హైదరాబాద్లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. నవంబర్లో ఏపీలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణం, సబ్ సీ కేబుల్ రంగాలలో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ సీఎంకు తెలిపారు. ఈ రంగంలో సింగపూర్-ఏపీ కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ, గృహ నిర్మాణం వంటి అంశాలలో ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేస్తున్నామని సింగపూర్ మంత్రి ఏపీ సీఎంకు వివరించారు. గతంలో హైదరాబాద్ వచ్చి సీఎం చంద్రబాబును కలిసిన నాటి సంగతులను సింగపూర్ మంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్ తో పాటు ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read also:RameshKumar : ప్రభుత్వ సంస్థలు జవాబుదారీగా ఉండాలి: సుప్రీంకోర్టు జస్టిస్ లావు నాగేశ్వరరావు
